FlipkartSearch

Monday 29 January 2018

అంబేద్కర్ అందరివాడు

జై భారత్... అంబేద్కర్ అందరివాడు
👉చిన్నప్పటి నుండి ఆయన పడ్డ అవమానాలు,అవహేళనలు చూసి తన జాతి బానిస విముక్తికి మరియు వారి హక్కుల కోసం పోరాడాడు ఆయన దళితుల కోసం ఏమీ చేసాడో అందరికీ తెలుసు.
👉కానీ భారత జాతికి అంత కన్నా ఎక్కువే చేసారు.
👉నిజానికి ఆయన భారత రాజ్యాంగం రాయకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసాయి.రాజ్యాంగం కన్నా ముందే ఆయన" *స్టేట్స్ అండ్ మైనార్టీస్*"అనే పుస్తకం రాసుకున్నారు.
👉అందులో ప్రధానంగా ఓటు హక్కు వున్నా ప్రతి ఒక్కడికి భూ వసతి కావాలని కోరుకున్నారు నిజంగా అది మన ఇప్పటి రాజ్యాంగంలో ఉంటే దేశంలోని లక్షల ఎకరాల భూమి కొద్ది మంది చేతిలో కాకుండా ప్రతి రైతుకు భూమి వుంటుండేటిది, భూములు జాతీయం అవుతుండే.
👉అంటారని తనం కాదు అస్సలు కులం ఉండొద్దూ అనుకున్నారు కానీ కుదరలేదు.
ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇపుడున్న రాజ్యాంగంలో బాబాసాహేబ్ ఆలోచన విధానాల్లోనీ చాల అంశాలను చేర్చలేకపోయారు కేవలం బ్రాహ్మణ అదిపత్యము వల్ల.
🌹దేశానికి 200సం.కు సరిపడా
విద్యా, విదేశీ వ్యవహారాలలో ఆయనకు సరైనా అవగాహన ఉంది.
🌹ప్రతీ వయోజనుడికి *ఓటు హక్కు* కలిపించారు
🌹 *వ్యక్తి గత ఆస్తి రద్దు* చేయమన్నారు
🌹 *పరిశ్రమలను జాతీయ* చేయమన్నారు
🌹 *మహిళలకు ఆస్తి హక్కు* ఉండాలి అగ్రవర్ణ మహిళలు బానిసలుగా ఉన్నారు వారికి హక్కులు ఉండాలని *హింద్ కోడ్ బిల్లు* తయారు చేస్తే అది అమలు చేయకపోతే *భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మొట్ట మొదటిసారి తన మంత్రి పదవి(న్యాయ శాఖ) కు రాజీనామా*చేసారు. ఎవరి కోసం అగ్రవర్ణ మహిళ హక్కుల కోసం.
(రాజ్యాంగం రాసిన వ్యక్తి రాజీనామా చేసారు).
🌹పధ్నాలుగు గంటల గొడ్డు చాకిరీ వ్యవస్థను బద్దలు కొట్టి 1942 సం.లో *8గంటల పని* విధానాన్ని తిసుకవచ్చి
*ఉద్యోగులకు DA, ESI, PF, INSURENCE*లాంటి ఫలాలను అందించినది అంబేడ్కర్ గారు.
*Employment exchange in INDIA*ను ప్రవేశ పెట్టారు.
🌹లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలలో *దళిత హక్కులతో పాటు BC లకు విధ్యా, వైద్యం, ఉధ్యోగాల కోసం మరియు మైనార్టీ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆస్తుల రక్షణ కోసం ప్రతినిధిగా హాజరై తన గళాన్ని వినిపించారు.*
🌹1935 లో *రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా*ఏర్పాటుకు కారణం అంబేడ్కర్ గారి ఆలోచనలే. హిల్టన్ యంగ్ కమీషన్ కు వివరాలు సమర్పించారు.
🌹 *దామోదర్ వాలి ప్రాజెక్ట్,హిరాకుడ్ ప్రాజెక్ట్, ద సన్ రివర్ వాలి ప్రాజెక్ట్*1945 లో ఆయన ఆలోచనల ప్రతి రూపాలే.
🌹 *గ్రీడ్ సిస్టంను* ప్రవేశ పెట్టింది అంబేడ్కర్
🌹 *పవర్ సిస్టం డెవలప్ మెంట్* కొరకు
*సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్(CTPB)*ను ఏర్పాటు చేసింది అంబేడ్కర్ గారు.
🌹 *సెంట్రల్ వాటర్ ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కమిషన్(CWINC)ను* రూపకల్పన చేసారు.దీనివల్ల దేశము లో నేటికీ పొలాల్లోకి ,ఇంటికి నీరు అందుతుంది.
🌹రెండో ప్రపంచ యుద్దం తరువాత దేశములో తలెత్తిన అనేక సమస్యలను *Reconstruction Committee Council లో మెంబర్*గా ఉండి
పరిష్కారం చేసారు.
🌹 "The Evolution of Provincial Finance of
British in India "అనే అంశం మీద ఆయన చేసిన PH.D లోని థిసేస్ *13ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్కు*మూల ఆధారం.
🌹 *జాతీయ చిహ్నంగా నాలుగు సింహాలను* సారనాథలోని అశోక పిల్లర్ నుండి తీసుకుంది అంబేద్కర్ గారు.
🌹 *అశోక్ చక్రాన్ని ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లో*చేర్చింది అంబేడ్కర్.
🌹రాజ్యాంగం ఏ భేదం లేకుండా… *భారత ప్రజలమైన మేము*… అంటూ మొదలవుతుంది మన రాజ్యాంగం. ఈ ఒక్క మాటతో *భారత నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే*అని చెప్పారు అంబేద్కర్. అప్పటికే కులాలుగా, మతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే ఒక్క మాటతో ఒక్కటి చేశారు. ఈ సమానత్వంతోనే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
🌹 *దేశంలో పటిష్ఠమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు* అంబేద్కర్. *ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దేలా అద్భుతమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.* ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. *పాలకులు దారితప్పితే ప్రజలు ప్రశ్నించే హక్కు ఇచ్చారు.* హక్కులతో పాటు ప్రభుత్వాలను గైడ్ చేసేలా ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. మనకంటే చాలా ముందుగా రాజ్యాంగం రాసుకున్న అమెరికా వ్యవస్థ కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించలేకపోయింది. కొన్ని పరిష్కారం లేని సమస్యల్ని సృష్టించింది. కానీ *మన రాజ్యాంగం భవిష్యత్ ను చాలా ముందుగా ఊహించి పరిష్కారాలు చూపేలా రచించారు*అంబేద్కర్.
🌹 *అంబేద్కర్ న్యాయశాస్త్రంలో డాక్టరేట్* సాధించారు. మనదేశంలో పౌరహక్కుల విలువను బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా… వాటిని రాజ్యాంగంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని ఎవరూ కాదనే అవకాశం లేకుండా తిరుగులేని రక్షణ కల్పించారు. *ప్రజల చుట్టూనే వ్యవస్థ పనిచేసేలా* చేశారు. ప్రతి పౌరుడూ తన ఆలోచనలు చెప్పుకోగలిగేలా *భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు అంబేద్కర్.
🌹 *దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్ఛనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు* బాబా సాహెబ్. *అర్టికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.*
🌹దేశంలోని ప్రజలకు తిండి, బట్ట, ఉద్యోగం ఇవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలపైనే పెట్టారు అంబేద్కర్. అందరికీ సమాన అవకాశాలుండాలని చెప్పారు. మహిళలకు రాజకీయ స్వాతంత్ర్యం ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్.
🌹 *దేశంలో ఎన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నా భారతజాతి సమైక్యతను, సమగ్రతను అంబేద్కర్ కోరుకున్నారు.* అందుకే రాష్ట్రాల స్వేచ్ఛను గౌరవిస్తూనే…ఆర్టికల్ 3ను ప్రవేశ పెట్టి *దేశం పటిష్ఠంగా ఉండడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండే ఏర్పాటు చేశారు.* రాష్ట్రాలు దేశం నుంచి విడిపోయే అధికారం లేకుండా చేశారు. ఎన్నిరకాల అభిప్రాయాలు, వాదాలున్నా ఇండియా ఒక్కటేనన్న మాటను శాశ్వతం చేశారు. మన రాజ్యాంగం బలమైంది కావడం వల్లే దశాబ్దాలుగా భారతజాతి ఒకటిగా, తిరుగులేని శక్తిగా కొనసాగుతోందంటారు నిపుణులు.
ఇంకా అనేక సంస్కరణలు మరియు సేవలను భారత జాతికి అంబేడ్కర్ అందించారు.
ఇప్పుడు చెప్పండి సగర్వంగా బాబాసాహెబ్ అందరివాడనీ,
 *జై అంబేద్కర్-జై జై అంబేద్కర్*

No comments:

Post a Comment